న్యూఢిల్లీ : కొవిడ్-19ని సమర్ధంగా ఎదుర్కోవడంలో యూపీ సర్కార్ విఫలమైందని రాష్ట్ర బీజేపీ నేతల్లో ఓ వర్గం విమర్శిస్తున్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గురువారం సమావేశమయ్యారు. యూపీ బీజేపీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అగ్ర నేతలతో ఆయన తొలిసారిగా భేటీ అయ్యారు. యోగి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతోనూ శుక్రవారం చర్చలు జరపనున్నారు.
యూపీలో నాయకత్వ మార్పు ఉండదని యోగి ఆదిత్యానాధ్ కరోనాను సమర్ధంగా కట్టడి చేయగలిగారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ ప్రముఖ నేత జితిన్ ప్రసాద చేరికతో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మరింత బలోపేతమైందని ఆయన రాకను యోగి స్వాగతించారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా అగ్రనేతలతో యోగి చర్చించనున్నట్టు సమాచారం.