న్యూఢిల్లీ: పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) ఇవాళ సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్, బాలకృష్ణలు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాది వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. పతంజలి సంస్థ ఉత్పత్తులకు గురించి మెడికల్ యాడ్స్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో గతంలో పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రత్యక్షంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. జస్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని బాబా రాందేవ్, బాలకృష్ణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
#WATCH | Yog Guru Ramdev leaves from Supreme Court. He appeared before the court in the misleading advertisement case filed against the Patanjali Ayurveda.
He tendered an unconditional apology before the Supreme Court for violating the apex court’s order for misleading… pic.twitter.com/y9oz8vl1IL
— ANI (@ANI) April 2, 2024