న్యూఢిల్లీ: ఉద్యోగులకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ మాదిరిగానే యోగా బ్రేక్ కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తన పరిధిలోని అన్ని విభాగాలను శనివారం కోరింది. ఒత్తిడిని దూరం చేసి పనిపై ఏకాగ్రతను పెంచడంలో యోగా దోహదపడుతుందని తెలిపింది. ఉద్యోగుల కోసం ఆయుష్ మంత్రిత్వశాఖ ఇప్పటికే ఐదు నిమిషాల యోగా ప్రొటోకాల్ను డిజైన్ చేసింది. దీనికి ‘వై-బ్రేక్’ అని పేరు పెట్టింది.