Miyazaki Mango | న్యూఢిల్లీ: ఫలరాజు మామిడి పండ్లను తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. ఎండాకాలంలో రకరకాల వెరైటీల్లో దొరికే ఈ పండ్లకు యమ డిమాండ్ ఉంటుంది. దాదాపు రూ.100కి కిలో పండ్లు అమ్ముతుంటారు. కానీ మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే అదృష్టం ఉండాలి. ఈ పండ్లను కొనాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్లో పండిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లుగా పేరుగాంచిన ఈ మియాజాకి పండ్ల తోటను కాపాడటానికి కుక్కలను కాపాలా ఉంచుతుంటారు.