న్యూఢిల్లీ: ఖాదీతో తయారు చేసిన అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఇవాళ లడాఖ్లోని లేహ్లో ఎగురవేశారు. మహాత్మాగాంధీ 152వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండాను ఆవిష్కరించారు. లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేశారు. ఖాదీ నూలుతో తయారు చేసిన ఆ జెండా సుమారు 225 ఫీట్ల పొడుగు, 150 ఫీట్ల ఎత్తు ఉన్నది. ఆ జెండా సుమారు 1400 కిలోల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57వ ఇంజినీర్ రెజిమెంట్ ఆ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసింది.
ఖాదీ జాతీయ జెండాకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో షేర్ చేశారు. గాంధీ జయంతి రోజున అతిపెద్ద ఖాదీ తిరంగా ఎగరడం గర్వంగా ఉందన్నారు. బాపూను స్మరించిన తీరును సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇది భారతీయ చేనేత కళాకారులను ప్రోత్సహిస్తుందని, జాతి ఔనత్యాన్ని పెంచుతుందని తెలిపారు. ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ (కేవీఐసీ) ఈ జెండాను తయారు చేసింది. ఖాదీ జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ కుంద్ నరవాణే కూడా ఉన్నారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఈ సందర్భంగా సెల్యూట్ చేశాయి.
It is a moment of great pride for 🇮🇳 that on Gandhi ji's Jayanti, the world's largest Khadi Tiranga is unveiled in Leh, Ladakh.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2021
I salute this gesture which commemorates Bapu's memory, promotes Indian artisans and also honours the nation.
Jai Hind, Jai Bharat! pic.twitter.com/cUQTmnujE9