పాకిస్తాన్ అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థిక ఇబ్బందులు మొదలుకొని… విద్యుత్ రంగం సహా అన్ని రంగాల్లోనూ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి అంతర్జాతీయ వేదికల వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. పాకిస్తాన్లోని కరెంట్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, గ్రిడ్ల నాణ్యతను మరింత పెంచడం, సరఫరాలో మరింత నాణ్యత ప్రమాణాలను పెరగడం, సరఫరా కంపెనీల కార్యకలాపాలు పెరగడానికి అనుకుగణంగా 195 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ఓ ప్రకటన చేసింది. ఇలా చేయడం ద్వారా రెవిన్యూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి, నష్టాల ఊబిలోంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని ప్రపంచ బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే సమాచార, సాంకేతిక వ్యవస్థలను కూడా మరింత ఆధునికీకరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. దీంతో కరెంట్ సంక్షోభం నుంచి పాక్ గట్టెక్కినట్టేనని ప్రపంచ బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు.