పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కి శుభాకాంక్షలు. పంజాబ్ అభివృద్ధి కోసం, ప్రజల కోసం కలిసి పనిచేద్దాం అంటూ మోదీ ట్వీట్ చేశారు.
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మాన్చే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.