Congress Party | న్యూఢిల్లీ : త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాని, ఆ పదవీకాలం మరో రెండేండ్ల పాటు ఉంందన్నారు. కాబట్టి తాను ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చిచెప్పారు.
దిగ్విజయ్ సింగ్ భోపాల్ లోక్సభ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేతిలో దిగ్విజయ్ ఓడిపోయారు. 1984, 1991లో రాజ్గర్హ్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే రాజ్గర్హ్ లోక్సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే గెలుపొందింది.