న్యూఢిల్లీ: అవయవ దానం కోసం పురుషుల కన్నా మహిళలే అధికంగా తమ సమ్మతి తెలియజేస్తున్నారు. అవయవ దానం కోసం ఆధార్ ప్రామాణీకరణ సంతకాల కోసం ఇటీవల నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనేజేషన్ (ఎన్ఓటీటీఓ) వెబ్సైట్ను ప్రారంభించింది. ఇందులో సెప్టెంబర్ 16 నుంచి ఇప్పటివరకు 82 వేల మంది అవయవ దానం కోసం ప్రతిజ్ఞ చేశారు. అవయవ దానం కోసం ముందుకొచ్చిన రాష్ర్టాలలో మహారాష్ట్ర (23,369) మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ (18,847), తెలంగాణ (11,564) రెండు, మూడు స్థానాలలో నిలిచాయి.