ముంబై: ఒక మహిళ వీధి కుక్కపై యాసిడ్ పోసింది (Woman Throws Acid At Stray Dog). ఈ సంఘటనలో అది ఒక కన్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మాల్వాని ప్రాంతంలోని అపార్ట్మెంట్ సముదాయం వద్ద 35 ఏండ్ల సబిస్తా అన్సారీ ఒక వీధి కుక్కపై యాసిడ్ పోసింది. దీంతో కుక్క బ్రౌనీ బాధతో అల్లాడిపోయింది.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే టీవీ నటి జయ భట్టాచార్య, ఆమె బృందం రంగంలోకి దిగారు. ఎన్జీవో సంస్థ ద్వారా నిర్వహిస్తున్న జంతు సంరక్షణ కేంద్రానికి ఆ కుక్కను తరలించి చికిత్స అందించారు. యాసిడ్ దాడి వల్ల అది ఒక కన్ను కోల్పోయినట్లు వారు ఆరోపించారు. కుక్కపై యాసిడ్ దాడి చేసిన సబిస్తా అన్సారీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ మహిళ పిల్లులకు ఆహారం పెడుతుందని, ఆ పిల్లులపై కుక్క దాడి చేయడంతో ఆగ్రహించి ఈ చర్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH : Woman booked for acid attack on dog in mumbai.
The Mumbai police recently booked a 35-year-old woman for allegedly throwing acid on a dog in Malad. The police registered an FIR against the woman after Balasaheb Tukaram Bhagat (53), the dog's caretaker, lodged a complaint… pic.twitter.com/xc3mKH3Us5— upuknews (@upuknews1) August 18, 2023