Indore | ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మహిళలు కలిసి ఓ మహిళ(30)ను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించారు. గౌతంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బచోరా గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది.
నలుగురు మహిళలు బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చి విచక్షణ రహితంగా దాడిచేశారు. నిందితులైన నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తకు తనపై ఉన్నవీలేనివీ నూరుపోస్తున్నదని అనుమానించిన నిందితురాలు ఒకరు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు.