న్యూఢిల్లీ : తాము అమితంగా ప్రేమించేవారిని సర్ప్రైజ్ చేసేలా వినూత్ర ప్రపోజల్స్ సోషల్ మీడియాలో (Viral Video)తరచూ కనిపిస్తుంటాయి. పర్యాటక ప్రదేశాలు లేదా చారిత్రక కట్టడాల ఎదుట చేతిలో రింగ్తో మోకాలిపై కూర్చుని ప్రియమైన వారికి ప్రపోజ్ చేసే వీడియోలు చూస్తూనే ఉంటాం. అయితే టెంపుల్ ముందు ఎవరైనా ప్రపోజ్ చేయడం మాత్రం అరుదైన విషయమే.
లేటెస్ట్గా కేదార్నాథ్ ఆలయం ఎదుట ఓ మహిళ తన బాయ్ఫ్రెండ్ ఎదుట ప్రేమను వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో యల్లో ఎథ్నిక్ దుస్తుల్లో మెరుస్తున్న జంట కనిపించగా మహిళ ఆలయం ఎదుట ప్రియుడికి ప్రపోజ్ చేయడం చూడొచ్చు.
One of the Reasons why Smartphones should be Banned from All Leading Temples & Shrines
Just a Basic Phone within 20 KMs from the Main Temple, Eliminates Unnecessary Crowd
PS – I’m writing this from Kedarnath 🛕
— Ravisutanjani (@Ravisutanjani) July 1, 2023
ప్రముఖ ఆలయాలు, మసీదుల వద్ద స్మార్ట్ఫోన్లు ఎందుకు ఫోన్ చేయాలనేందుకు ఇది ప్రధాన కారణం…ప్రధాన ఆలయాలకు 20 కిలోమీటర్ల పరిధిలో కేవలం బేసిక్ ఫోన్లను అనుమతిస్తే అనవసరమైన రద్దీని నివారించవచ్చని..కేదార్నాథ్ నుంచి ఇలా రాస్తున్నానని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆలయం ఎదుట ఇలా చేయడం తప్పేమీ కాదని కొందరు సమర్ధించగా ఇది ఆలయ మర్యాదలను మంటగలపడమేనని పలువురు నెటిజన్లు మండిపడ్డారు.