భువనేశ్వర్: ఒడిశాలోని (Odisha) సంభాల్పూర్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. సోనేపూర్కు చెందిన కుని సునా (Kuni Suna) అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కుని సునాకు నెలలు నిండటంతో సంభాల్పూర్లోని వీర్ సురేందర్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ప్రబుత్వ దవాఖానలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు. ఈ క్రమంలో ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో కవల పిల్లలు పుట్టారని, వారిద్దరు ఆడపిల్లలని వైద్యులు చెప్పారు. మళ్లీ 2.02 గంటలకు మరో పాపకు జన్మనిచ్చిందని, 2.04 గంటల సమయంలో ఒక బాబు పుట్టాడని తెలిపారు. నలుగురు పిల్లల పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. అయితే వారు కొద్దిగా బరువు తక్కువగా ఉండటంతో స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్కు తరలించామన్నారు.
ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని… 5.12 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తమ దవాఖానలో ఇలా జరగడం ఇదే మొదటిసారని వెల్లడించారు.