బెంగళూర్ : శ్రీకృష్ణ జన్మాష్టమి (Janmashtami Celebrations) సందర్భంగా మంగళూర్కు చెందిన ఓ మహిళ ఏకంగా 88 వంటకాలను సిద్ధం చేసింది. జన్మాష్టమి రోజున భక్తులు పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనంతరం రాత్రికి భోజనం చేస్తారు. జన్మాష్టమి రోజున మంగళూర్ మహిళ తన భక్తిని చాటుకుంటూ బాలగోపాలుడి కోసం 88 వంటకాలను ప్రిపేర్ చేశారు.
Proud of her and her devotion to lord Krishna. She is my patient. She has again broken her previous record. 88 dishes were prepared last night for Gokulashtami. #janamashtami pic.twitter.com/SDoh3JKTvM
— Dr P Kamath (@cardio73) September 7, 2023
డాక్టర్ పీ కామత్ ఈ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మంగళూర్కు చెందిన డాక్టర్ కామత్ కార్డియాలజిస్ట్ కాగా, మహిళ ఆయన పేషెంట్. కృష్ణుడి కోసం మహిళ తయారుచేసిన వంటకాలన్నీ ఈ ఫొటోల్లో కొలువుతీరాయి.
లడ్డూ, బర్ఫీ, పేడా, జిలేబీ వంటి ఎన్నో డిష్లను ఆమె సిద్ధం చేసింది. కృష్ణుడి పట్ల ఆమె భక్తికి గర్వంగా ఉంది..ఆమె నా పేషెంట్..గోకులాష్టమి కోసం గత రాత్రి ఆమె 88 డిష్లను ప్రిపేర్ చేసిందని ట్విట్టర్ పోస్ట్లో డాక్టర్ కామత్ రాసుకొచ్చారు. నెటిజన్లు సైతం చిన్ని కృష్ణుడిపై మహిళ భక్తిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు.
Read More :
Sri Krishna Janmashtami | భగవద్గీతకు మరింత చేరువయ్యే సందర్భం శ్రీకృష్ణ జన్మాష్టమి