సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఆ వీడియోలో హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది. వీణ అనే ఓ మహిళ.. తన సొంత కాళ్ల మీద నిలబడటం కోసం.. భర్త చనిపోయినా నలుగురు కూతుళ్లను చదివించి ప్రయోజకులను చేయడం కోసం స్ట్రీట్ వెండర్గా మారింది.
తన భర్త బతికి ఉన్న సమయంలో కూడా 20 ఏళ్ల పాటు ఇళ్లలో పనిచేసి డబ్బులు సంపాదించింది. తన భర్త చనిపోయాక ఏం చేయాలో తెలియక అమృత్సర్లో ఫుడ్ స్టాల్ పెట్టి.. అతి పెద్ద పరాటాను చేసి తనేంటో నిరూపించుకుంది. ఇప్పుడు తను తయారు చేసే అతి పెద్ద పరాటాను తినడం కోసం అమృత్సర్ వాసులు క్యూ కడుతున్నారు. లోపల ఆలుగడ్డతో చేసిన కూర్మాను పెట్టి ఈ పరాటాను తయారు చేస్తుంది వీణ.
తను అతి పెద్ద పరాటాను ఎలా తయారు చేస్తుంది. తన కూతుళ్లు కూడా తనకు పరాటా బండి దగ్గర ఎలా సాయం చేస్తారు.. అనే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. ఆ వీడియో చూసి వీణకు హేట్సాఫ్ అంటున్నారు. నువ్వు అందరికీ నిజమైన స్ఫూర్తి అంటూ కామెంట్లు చేస్తున్నారు.