న్యూఢిల్లీ : రెస్టారెంట్కు వెళ్లినప్పుడు అత్యధికులు ఆర్డర్ చేసే వంటకాల్లో చికెన్ (Chicken Dish) ముందువరసలో ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ స్నాక్స్ నుంచి చికెన్ కబాబ్స్, గ్రేవీస్ వరకూ ఎన్నో చికెన్ వెరైటీస్ను రెస్టారెంట్స్లో ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఇక చండీఘఢ్లోని ఓ రెస్టారెంట్లో మహిళకు చేదు అనుభవం ఎదురైంది.
నగరంలోని చిలీస్ రెస్టారెంట్కు రణ్జోత్ కౌర్ అనే మహిళ సెప్టెంబర్ 14న వెళ్లింది. రెస్టారెంట్లో తాను ఆర్డర్ చేసిన చిపోట్లె చికెన్ రైస్లో పురుగు కనిపించడంతో ఆమె కంగుతింది. తాను అప్పటికే ఫుడ్ను తిన్న తర్వాత మిగిలిన ఆహారంలో బతికున్న పురుగు కనిపించిందని కౌర్ వాపోయింది. వెంటనే ఆమె మేనేజర్కు ఫిర్యాదు చేయడంతో ఫుడ్ను పరిశీలించినా పెద్దగా స్పందించలేదు.
ఘటనకు సంబంధించి వీడియో తీసేందుకు కౌర్ ప్రయ్నతించగా రెస్టారెంట్ సిబ్బంది ఆమెను వారించి టేబుల్పై నుంచి ఫుడ్ను తొలగించారు. రెస్టారెంట్ తీరుపై ఆగ్రహంతో మహిళ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ను ఆశ్రయించింది. దీంతో సదరు రెస్టారెంట్పై అధికారులు రూ. 25,000 జరిమానా విధించడంతో పాటు బిల్లు మొత్తాన్ని మహిళకు చెల్లించాలని ఆదేశించారు.
Read More :
India-Canada Row | ఖలిస్తానీ గ్రూపులతో ఐఎస్ఐ ఏజెంట్ల రహస్య భేటీ..!