న్యూఢిల్లీ : భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల (India-Canada Row) నేపధ్యంలో కెనడాలో మాటువేసిన ఐఎస్ఐ ఏజెంట్లు, ఖలిస్తాన్ ఉగ్ర గ్రూపుల చీఫ్ల మధ్య వాంకోవర్లో ఇటీవల రహస్య భేటీ జరిగిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఐదు రోజుల కిందట జరిగిన ఈ సమావేశంలో సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్, ఖలిస్తానీ సంస్ధల ఇతర నేతలు పాల్గొన్నారని నిఘా వర్గాల సమాచారం.
ఐఎస్ఐ ఏజెంట్లు, ఖలిస్తానీ గ్రూపుల మధ్య జరిగిన ఈ భేటీలో వీలైనంత మేర భారత్ వ్యతిరేక ప్రచారం వ్యాప్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్లాన్-కేగా చెబుతున్న ఈ ప్రణాళికలో భాగంగా కెనడాలో గత కొద్దినెలలుగా ఖలిస్తానీ కార్యకలాపాలకు ఐఎస్ఐ పెద్దమొత్తంలో నిధులు సమకూరుస్తోంది. ఈ నిధులను ప్రజలను నిరసనల్లో పాల్గొనేలా రెచ్చగొట్టేందుకు, భారత్ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టేందుకు పోస్టర్లు, బ్యానర్ల కోసం వెచ్చిస్తున్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి.
కాగా, భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ పరమైన కారణాలతో సెప్టెంబర్ 21 నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్సైట్లో పేర్కొంది. కాగా, కెనడియన్ల వీసా సేవల నిలిపివేతను భారత్ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
Read More :
Khalistani Terrorist | కెనడాలో మరో ఖలిస్థాని ఉగ్రవాది దారుణ హత్య