తను ఒక ప్యాసెంజర్. బస్ ఎక్కింది. కానీ.. తనకు తెలియదు.. కొద్దిసేపటి తర్వాత తనే ఆ బస్సు నడపాలని. ఎందుకంటే.. బస్సు డ్రైవర్కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన బస్సు నడపలేకపోయాడు. దీంతో వెంటనే స్టీరింగ్ అందుకుంది ఆ మహిళ. బస్సును నడిపి డైరెక్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటన పూణెలో చోటు చేసుకుంది.
41 ఏళ్ల యోగితా సతావ్.. పిక్నిక్కు వెళ్లింది. తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పిక్నిక్కు వెళ్లి తిరిగి బస్లో వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ తనకు ఆరోగ్యం బాగాలేదని.. స్పృహ తప్పిపడిపోబోయాడు. దీంతో వెంటనే బస్సులో ఉన్న యోగిత బస్సు స్టీరింగ్ అందుకొని బస్సును డ్రైవ్ చేసింది. తనకు కేవలం కారు నడిపిన అనుభవమే ఉన్నా.. బస్సును బాగానే కంట్రోల్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లింది. దాదాపు 25 కిలోమీటర్లు బస్సును నడిపింది యోగిత.
నేను ఎప్పుడూ బస్సు నడపలేదు. నాకు కారు నడపడం మాత్రమే తెలుసు. డ్రైవర్ను అర్జెంట్గా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడంతో వెంటనే నేను బస్సు స్టీరింగ్ పట్టుకున్నా. 25 కిలోమీటర్ల వరకు బస్సును నడిపా. ఆసుపత్రి వరకు నడిపా. ఆ తర్వాత బస్సు ఓనర్ కొత్త డ్రైవర్ను తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి కొత్త డ్రైవర్ బస్సును నడిపాడు.. అంటూ యోగిత చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.