భువనేశ్వర్: పోలీసులతో కలిసి వచ్చిన మహిళ వివాహ రిసెప్షన్ను అడ్డుకున్నది. (Woman disrupts wedding reception) వరుడిపై దాడి చేసి కొట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి ధౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఇంతలో ఒక మహిళ పోలీసులతో కలిసి అక్కడకు వచ్చింది. వివాహ రిసెప్షన్ను ఆమె అడ్డుకున్నది. వరుడిపై దాడి చేసి కొట్టింది. అక్కడున్న వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు.
కాగా, ఆ వ్యక్తితో తనకు నిశ్చితార్థం జరిగిందని ఆ మహిళ ఆరోపించింది. అతడు తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడని, తన నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని ఆమె వాపోయింది. దీంతో పోలీసులు ఆ వరుడ్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మహిళ ఆరోపణలపై ఆరా తీశారు. అయితే పోలీసుల సమక్షంలో వారిద్దరి మధ్య రాజీ కుదిరినట్లు బంధువులు తెలిపారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman disrupts wedding reception in Bhubaneswar, accuses groom of betrayal#odisha #Bhubaneswar pic.twitter.com/93FSXrf1Ch
— Karthick Chandrasekar (@kart997) May 13, 2025