Fire Accident | లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో థియేటర్లో ఉన్న ఓ మహిళ, చిన్నారి మృతి చెందారు.
యూపీకి చెందిన ఓ మహిళ సర్జరీ నిమిత్తం పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్లో చేరింది. మరో చిన్నారి కూడా గుండె సర్జరీ నిమిత్తం అదే ఆస్పత్రిలో చేరింది. ఆ ఇద్దరు ఆపరేషన్ థియేటర్లో ఉండగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఇద్దరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.