Sanjay Raut : కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశమే లేదని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లేకపోతే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేదే కాదని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరిగేది కాదని రౌత్ వ్యాఖ్యానించారు. దేశం ఇప్పుడు ఐకమత్యంగా ఉన్నదంటే దానికి కారణం కాంగ్రెస్ నాయకత్వమేనని పేర్కొన్నారు. బీజేపీకి దేశం కంటే వ్యాపారులే ముఖ్యమని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. దేశానికి నాయకత్వం లభించి ఉండేది కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరిగేది కాదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి. విభిన్న సంస్కృతి సంప్రదాయాలున్న దేశాన్ని ఏకతాటిపై ఉంచి ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇవి బీజేపీకీ ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే బీజేపీ దేశం గురించి ఆలోచించదు. కేవలం వ్యాపారవేత్తల గురించి మాత్రమే ఆలోచిస్తుంది’ అని సంజయ్ రౌత్ విమర్శించారు.