న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారతీయుల సగటు జీవితకాలం ఏటేటా పెరుగుతున్నది. ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులతో ఆయుర్దాయం ఈ ఏడాది నాటికి 70 ఏండ్లకు చేరింది. ఐక్యరాజ్యసమితి చెప్పిన వాస్తవమిది. 1950లో 35.21 సంవత్సరాలుగా ఉన్న సగటు భారతీయుడి ఆయుష్షు 2100 నాటికి గణనీయంగా మెరుగై 81.96 ఏండ్లకు చేరుతుందని అంచనా వేసింది. వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని, ఆయుష్షును కూడా పెంచుకొంటున్నారని వెల్లడించింది. ఈ 150 ఏండ్ల వ్యవధిలో ఆయుర్థాయం మెరుగుదల విషయంలో అమెరికా కంటే మనమే మెరుగ్గా ఉన్నాం.
ఆయుర్దాయం పెరుగుదలకు కారణాలివీ