న్యూఢిల్లీ/పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. ‘అమిత్ షా ఓ పిచ్చోడు. తెలివి తక్కువ వ్యక్తి. బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే పీకిపారేశామో.. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తాం’ అని హెచ్చరించారు. ఆదివారం సోనియాగాంధీతో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి బయలుదేరారు.
ఈ సందర్భంగా లాలూ విలేకరులతో మాట్లాడారు. బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీహార్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జంగిల్ రాజ్ గురించి మాట్లాడని అమిత్ షా.. ఇప్పుడు మాట్లాడుతున్నారని, అసలు జంగిల్రాజ్ గుజరాత్లో ఉన్నదని చురక అంటించారు.