Election Comission | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు దగ్గరపడుతున్నాయి. దేశంలో కోవిడ్ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రచారానికి అనుమతించాలా? వద్దా? కోవిడ్ కారణంగా ప్రచారం విషయంలో ఏం చేయాలి? అన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఐదు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వర్చువల్గా సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలోనే ఎన్నికల ప్రచారానికి అనుమతించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కోవిడ్ పరిస్థితులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అడిగి తెలుసుకోనుంది. ర్యాలీలు, రోడ్షోలు, రాజకీయ మీటింగ్లు, ఇలాంటి వాటిపై జనవరి 15 వరకు నిషేధాన్ని ప్రకటిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా పేర్కొంది.