అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 17 పూరిండ్లు దగ్ధమయ్యాయి. జిల్లాలోని నిలావేరు మండలం అదపాకలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. దీంతో మొత్తం 17 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిపామక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..