న్యూఢిల్లీ: న్యాయం కోసం మళ్లీ ఎదురొడ్డి పోరాడుతానని బిల్కిస్ బానో పేర్కొన్నారు. తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద గుజరాత్లోని బీజేపీ సర్కారు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
‘మళ్లీ న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం నాకు సులభమైన విషయం కాదు. నన్ను, నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసిన దోషులను విడుదల చేయడం దిగ్భ్రాంతిపరిచింది. అయితే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతు నన్ను మళ్లీ ముందుకు నడిపిస్తున్నది’ అని ఆమె పేర్కొన్నారు.