న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఈ నెల 13లోపు పార్లమెంట్పై దాడి చేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ‘నన్ను చంపడానికి భారత్కు చెందిన ఏజెన్సీలు ప్రయత్నించాయి. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. నన్ను చంపాలన్న కుట్రకు పగతీర్చుకుంటాను.
ఈ నెల 13లోపు ఎప్పుడైనా పార్లమెంట్పై దాడి చేస్తాం’ అని ఆ వీడియోలో పన్నూ హెచ్చరించాడు. అలాగే 2001లో పార్లమెంట్పై దాడి చేసిన అఫ్జల్గురు ఫొటోతోపాటు ఖలిస్థాన్గా మారనున్న ఢిల్లీ అని ఆ వీడియోలో ఉన్నది. ఖలిస్థాన్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.