Mayawati : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ రాజకీయ భవిష్యత్ విషయంలో బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కీలక కండీషన్స్ పెట్టారు. ఆకాష్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని కండీషన్ పెట్టారు. ఆయన రిటైర్మెంట్ తర్వాతే ఆకాష్ ఆనంద్కు బాధ్యతలు అప్పగించే విషయాన్నిపరిశీలిస్తామని మాయావతి స్పష్టం చేశారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. తన అల్లుడు ఆకాష్ రాజకీయ భవిష్యత్ కోసం అశోక్ సిద్ధార్థ్ రాజకీయాలు వదిలేసి, త్యాగానికి సిద్ధం కావాలని ఆమె సూచించారు. సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాతే ఆకాష్కు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అశోక్ సిద్ధార్థ్ను మాయావతి ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా చేసిన పోస్టులో మాయావతి.. ఇతర అంశాలపై కూడా స్పందించారు. బీఎస్పీ చేపడుతున్న బహుజన ఉద్యమానికి రాబోయే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలు చాలా కీలకమైనవని అభిప్రాయపడ్డారు.
1. जैसाकि सर्वविदित है कि उत्तर प्रदेश, उत्तराखण्ड व पंजाब में विधानसभा का आमचुनाव अब बहुत नज़दीक है और ये तीनों ही राज्य, परमपूज्य बाबा साहेब डा. भीमराव अम्बेडकर के ’बहुजन समाज’ को ’शोषित से शासक वर्ग’ बनने हेतु उनके आत्म-सम्मान एवं स्वाभिमान के कारवाँ को आगे बढ़ाने के लिये…
— Mayawati (@Mayawati) September 9, 2026
పార్టీ కార్యకర్తలు, నేతలు తమ లక్ష్యాల్ని సాధించేందుకు, రాజకీయంగా ఎదిగేందుకు చిత్తశుద్దితో పని చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినట్లు ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. ఇటీవల ఆకాష్ ఆనంద్కు బాధ్యతలు అప్పగించే విషయంపై మాయావతి స్పందించారు. పెద్ద పదవులు చేపట్టేంత అనుభవం ఆకాష్కు ఇంకా లేదని, కొంతకాలం తర్వాతే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.