న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన వారు ప్రభుత్వం కల్పించే లాభదాయక పదవులను తీసుకోవచ్చా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయడం కాదా? అన్న అంశంపై ఇటీవల న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తన అభిప్రాయాన్ని పీటీఐతో పంచుకున్నారు. తాము ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే హక్కు రిటైరైన జడ్జీల మనస్సాక్షికే వదిలిపెట్టాలని అన్నారు.