రాయ్పూర్: బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరెస్సెస్, బీజేపీ కలిసి దేశంలో మతచిచ్చు రేపుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల మధ్య మతచిచ్చు రగిలించి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
దాదాపు 40 వేల సంవత్సరాల క్రితం దేశంలో అందరి డీఎన్ఏ ఒకేలా ఉండేదని ఆరెస్సెస్ నేతలు చెబుతున్నారని, మరి అలాంటప్పుడు ఈ పగలు, ధ్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారని బఘేల్ ప్రశ్నించారు. ఆరెస్సెస్ ఛీఫ్ పదవిని ఎప్పుడూ ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వ్యక్తులకే ఎందుకు కట్టబెడుతారని, ఒక దళితుడినిగానీ, ఆదివాసీనిగానీ ఎందుకు ఆరెస్సెస్ చీఫ్గా నియమించరని బఘేల్ నిలదీశారు.
రాయ్పూర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో బీజేపీ ప్రస్తావిస్తున్న సమస్యలు కొత్తవేమీ కావని, ఇప్పటికే కాంగ్రెస్ వాటిని గుర్తించి పరిష్కరిస్తున్నదని చెప్పారు.