సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయినా.. అందరి దృష్టీ ఆయన ప్రసంగంపై లేదు. ఆయన వెనక నిల్చున్న ఓ సాధువుపై కేంద్రీకృతమైంది. ఈ విషయం అఖిలేశ్ దృష్టికి వచ్చింది. దీంతో అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘ఈయన సీఎం యోగి కంటే చాలా పవర్ఫుల్ సాధువు. ఆయన కంటే పెద్ద సాధువు. చాంద్పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన్ను మీరు టీవీల్లో, ఫోన్లలో చూసే వుంటారు. గత ఐదేళ్లుగా మీరు చూస్తూనే వున్నారు. యోగి కంటే పెద్ద సాధువు’ అంటూ పరిచయం చేశారు. ఆయన పేరు స్వామి ఓంవేశ్. ఈయన చాంద్పూర్ నుంచి సమాజ్వాదీ తరపున బరిలోకి దిగుతున్నారు. 1996, 2002 ఎన్నికల్లో ఇదే చాంద్పూర్ నుంచి గెలిచారు కూడా.