న్యూఢిల్లీ: గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా నింగిలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల్ని ఇవాళ ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురు పైలెట్లలో ఒకరు కేరళ నివాసి ప్రశాంత్ నాయర్(Prashanth Nair) ఉన్నారు. గ్రూప్ కెప్టెన్ నాయర్ది పాలక్కడ్లోని నేన్మెరా గ్రామం. భారతీయ నౌకాదళంలో అతను సుఖోయ్ ఫైటర్ పైలెట్గా చేశారు. ప్రశాంత్ పేరెంట్స్ వాలంపిల్ బాలకృష్ణన్, కూలన్ఘాట్ ప్రమీల.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రశాంత్ .. విద్యార్థిలా చేశాడు. పాలక్కడ్లోని ఎన్ఎస్ఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో అతను విద్యాభ్యాసం చేశాడు. ఎన్డీఏ అకాడమీలో శిక్షణ పూర్తి చేశాడు. 1999లో అతను ఎయిర్ఫోర్స్లో విధుల్లో చేరాడు.
అమెరికాలో నాయర్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. అమెరికా ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో ఆయన ఫస్ట్క్లాస్ హానర్స్ పూర్తి చేశారు. 1998లో హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు.
గగన్యాన్కు ఎంపికైన ఆస్ట్రోనాట్స్కు రష్యాలో శిక్షణ ఇచ్చారు. 18 నెలల పాటు ఆ శిక్షణ కొనసాగింది. ఆ బృందానికి ప్రశాంత్ నాయర్ నాయకత్వం వహించారు. రష్యాలో శిక్షణ తర్వాత బెంగుళూరులోని హ్యూమన్ స్పే సెంటర్లోనూ ఆస్ట్రోనాట్స్ ప్రిపేరయ్యారు.
వ్యోమగాముల జాబితాలో ప్రశాంత్ నాయర్తో పాటు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, అంకద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు.