ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మిలిటరీ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందడంతో.. దేశ అత్యుత్తమ రక్షణ పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్(సిడియస్ – త్రివిధ దళాధిపతి) ఖాళీ అయింది. ఈ లోటును భర్తీ చేయడం అంత సులువు కాదు.
ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ దళాలను సమన్వయంతో ముందుకు నడపడానకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పదవి సృష్టించబడింది. చైనాతో సరిహద్దులో ఘర్షణ వాతావరణం ఉండడంతో ఇప్పుడు అత్యవసరంగా కొత్త సిడియస్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖ మరో వారం రోజుల్లో ప్రకటన చేయనుందని సమాచారం.
బిపిన్ రావత్ పదవి కాలం మరికొ్ద్ది కాలం ఉండగానే ఆయన చనిపోవడంతో సిడియస్ పదవిని ఎవరు చేపడతారని.. అందరూ ఆలోచిస్తున్నారు. బిపిన్ రావత్ అకాల మరణంతో ప్రస్తుతం అపద్ధర్మ సిడియస్గా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ముకుంద్ నరవాణె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముకుంద్ నరవాణె ప్రస్తుతం దేశంలో సీనియర్ మోస్ట్ మిలిటర్ ఆఫీసర్. ఆయన తరువాత స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జెనెరల్ సిపి మొహంతి, నార్తన్ ఆర్మీ ఫ్టినెంట్ జెనెరల్ వైకె జోషి ఉన్నారు.
సిడియస్ పదవి పొందడానికి గరిష్ఠ వయస్సు పరిమితి 65 సంవత్సరాలు. షెకాట్కర్ కమిటీ సూచనల ప్రకారం ప్రభుత్వం మూడు రక్షణ దళాల అధిపతులలో ఒకరిని సిడియస్గా నియమిస్తుంది. అదే సమయంలో మొదటి రెండు లేదా మూడు పర్యాయాలు సిడియస్గా ఆర్మీ చీఫ్ (భూతల సైన్యాధిపతి)ని నియమించాలని రక్షణ మంత్రిత్వశాఖ యోచిస్తోంది. దీనికి కారణం భారతదేశానికి ఎక్కువగా సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతోనే ఎక్కువగా యుద్ధాలు జరగడం.