మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో (Moradabad) విచిత్రం చోటుచేసుకున్నది. మొరాదాబాద్లోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ బోరింగు (Hand pump) నుంచి తెలుపు రంగులో (White water) ఉన్న నీళ్లు వస్తున్నాయి. దీంతో వాటిని పాలుగా (Milk) భావించిన ప్రజలు.. చేతి పంపులో నుంచి నీళ్లకు బదులు పాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్చేశారు. ఇంకేముంది క్షణాల్లో పట్టణమంతా ఆ వార్త వ్యాపించింది. దీంతో జనాలు ఆ బోరింగ్ వద్దకు క్యూకట్టారు. బాటిళ్లు, బకెట్లు, క్యాన్లు, బిందలు, ప్లాస్టిక్ కవర్లలో ఆ తెల్లటి ద్రవాన్ని పట్టుకుని వెళ్లారు.
సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు ఆ బోరింగ్ను పరిశీలించారు. అవి పాలు కాదని, కలుషిత నీళ్లని (Contamination) తెలిపారు. చేతిపంపు అడుగు భాగంలో చెడిపోయిందని, దీంతో అది ఒకట్టినప్పుడు తెలుపు రంగులో ఉన్న కలుషితమైన నీరు బయటకు వస్తున్నదని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టాలని బిలారి (Bilari) సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బోరింగును పూర్తిగా పరిశీలించిన తర్వాతే నీళ్లు తీసుకోవడానికి అనుమతించాలని స్పష్టం చేశారు.