Whishes: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్కు కెనడా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు భారత్లోని కెనడా రాయబార కార్యాలయం తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ‘భారత్కు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విషెష్ను షేర్ చేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న క్రమంలో భారత్కు కెనడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండో కెనడియన్ అయిన నిజ్జర్ 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో హత్యకు గురయ్యాడు.
ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 2023 సెప్టెంబర్ 18న ఆరోపణలు చేశారు. ట్రూడో వ్యాఖ్యలే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమయ్యాయి. ట్రూడో చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. కాగా, భారత్ 2020లో నిజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించింది.