న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. గత 203 రోజుల తర్వాత మళ్లీ ఇవాళే అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కేవలం 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 6049 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయి 28 వేల మార్కు దాటింది.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది. మహారాష్ట్ర (3,987 యాక్టివ్ కేసులు), గుజరాత్ (2,142), ఢిల్లీ (2,060), హిమాచల్ ప్రదేశ్ (1,933), కర్ణాటక (1,516), తమిళనాడు (1,366), హర్యానా (1,132) యాక్టివ్ కేసులపరంగా వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి.