మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ సీనియర్ నేత హరీశ్ రావత్ వ్యవహారం కాస్త ముదురుతోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే, ఇలా బెదిరిస్తున్నారని అధిష్ఠానం భావిస్తోంది. అయితే అసలు రావత్ మనసులో ఏముందనేది ఎవరికీ తెలియడం లేదు. టిక్కెట్ల వ్యహారంలో ఆయన అలిగినట్లు భావిస్తున్నా, పూర్తి విషయాలు మాత్రం బయటకు వెల్లడి కావడం లేదు. అటు రావత్ కూడా దీనిపై సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లపై స్పందించమని కోరగా… ”సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాలే అంటూ దాట వేశారు. సమయం రానివ్వండి. అన్నీ చెబుతాను. ప్రతి ఒక్కటీ బయటపెడతా. మీతో చెప్పకుంటే ఇంకెవరితో చెబుతాను చెప్పండి. నేనే మిమ్మల్ని పిలిచి మరీ చెబుతా. అప్పటి వరకూ హాయిగా ఉండండి” అంటూ రావత్ పేర్కొన్నారు.
మరోవైపు రాజకీయాలకు పూర్తిగా గుడ్బై చెప్పడానికే రావత్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. జనవరి 5న ఈ విషయంపై రావత్ కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రాజకీయ సన్యాసంపై జనవరి 5న కీలక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.