న్యూఢిల్లీ: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆ రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్ కూడా వెళ్లారు. అయితే రెజ్లర్ల ఆందోళన గురించి మాత్రం కేంద్ర మంత్రులు స్పందించడం లేదు. ఓ మహిళా రిపోర్టర్ రెజ్లర్ల నిరసన గురించి కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి(Meenakshi Lekhi)ని ప్రశ్నించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న మంత్రి లేఖిని రెజ్లర్ల గురించి అడిగారు. కానీ ఆమె ఆ రిపోర్టర్ ప్రశ్నకు బదులు ఇవ్వకుండా నడుచుకుంటూ పరుగులు తీశారు. మహిళా రిపోర్టర్ వెంటబడి ప్రశ్నిస్తున్నా.. ఆమె స్పందించకుండా తన కారు వైపు పరుగులు తీసింది. నిరసన చేస్తున్న రెజ్లర్ల గురించి చెప్పాలంటూ అడిగినప్పుడు.. చట్టపరమైన ప్రక్రియ నడుస్తున్నట్లు మీనాక్షి లేఖి తెలిపారు.
महिला पहलवानों के मुद्दे पर केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने दी तीखी प्रतिक्रिया
आप खुद देखें 👇 pic.twitter.com/9XqyJcwmgD
— Congress (@INCIndia) May 30, 2023
మహిళా రిపోర్టర్ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక పరుగులు పెడుతున్న మంత్రి మీనాక్షి లేఖి వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. మంత్రి మీనాక్షి లేఖి చాలా స్పార్ట్ రియాక్షన్ ఇచ్చినట్లు కామెంట్ చేసింది.