Rahul Gandhi | తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. బీజేపీ నేతలకు చరిత్ర తెలియదంటూ విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణం అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు.
ఏళ్ల తరబడి జైలులోనే ఉన్నారని, అమిత్ షాకు చరిత్ర తెలియదన్నారు. ఆయన చరిత్రను గుర్తుంచుకుంటాడని నేను ఆశించడం లేదన్నారు. ఇది కేవలం దృష్టి మళ్లించడమేనన్నారు. కుల గణనపైనే ఉందని.. దేశం సొత్తు ఎవరి చేతుల్లో ఉందనేది మొత్తం సమస్య అన్న రాహుల్.. ఈ విషయాలపై మాట్లాడేందుకు వారు (బీజేపీ) మాట్లాడడం లేదన్నారు. భయపడి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయా అంశాలను కాంగ్రెస్ నిరంతరం ముందుకు తీసుకెళ్తూనే ఉంటుందన్నారు. పేదలకు వారి హక్కులను కల్పిస్తామన్నారు.