Bus Tickets | ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ తరహా సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు బస్సుల్లోనూ విస్తరించేందుకు నడుం బిగించింది. త్వరలోనే దీనిపై ప్రయాణికులకు శుభవార్త చెబుతామని అక్కడి అధికారులు వెల్లడించారు.
అయితే, వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రం ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే చిన్న మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజు కూడా వసూలు చేస్తారు. యూపీఐ ఆధారిత పేమెంట్స్కు మాత్రం ఎలాంటి అదనపు రుసుము ఉండదు. ఇక హైదరాబాద్ మెట్రో కూడా వాట్సాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Schools Reopen | తమిళనాడు వ్యాప్తంగా తెరుచుకున్న విద్యాసంస్థలు
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
IT Raids | ఐటీ దాడుల్లో పట్టుబడిన రూ.351 కోట్లు.. ఆ నగదును ఏ బ్యాంక్లో జమచేయనున్నారంటే..?