Schools Reopen | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి (Schools Reopen). తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం కారణంగా వారం రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ పలు ప్రాంతాల్లో వరద తొలగిపోకపోవడంతో పాఠశాలలను తెరవలేదు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో పాఠశాలలను తెరిచారు.
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో గత వారం నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలు, అన్ని విద్యాసంస్థలు మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. పుదుచ్చేరి, కరైకల్, యానాం ప్రాంతాల్లోని పాఠశాలలు కూడా డిసెంబర్ 4, 5 తేదీల్లో మూతపడిన విషయం తెలిసిందే. పల్లవరం, తాంబరం, వండలూరు, తిరుపోరూర్, చెంగల్పట్టు, తిరుకజుకుండ్రంలలో కూడా పాఠశాలలు మూసివేయబడ్డాయి. ప్రస్తుతం అన్ని పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి.
#WATCH | Schools in Chennai reopen after remaining closed for a week due to the impact of Cyclone Michaung pic.twitter.com/TxKSCobWOt
— ANI (@ANI) December 11, 2023
Also Read..
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
IT Raids | ఐటీ దాడుల్లో పట్టుబడిన రూ.351 కోట్లు.. ఆ నగదును ఏ బ్యాంక్లో జమచేయనున్నారంటే..?