న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal)ను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు. స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు ఆయన్ను ప్రొడ్యూస్ చేశారు. మద్యం పాలసీ స్కామ్లో ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో రిపోర్టర్లు కేజ్రీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీని జుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో దాఖలు చేసుకున్నది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తున్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal brought to Rouse Avenue Court, says, “What the PM is doing is not good for the country.” pic.twitter.com/0wkXrw9b9x
— ANI (@ANI) April 1, 2024