న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కుల వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపట్టేలా యూజీసీని ఆదేశించాలని కోరుతూ మరణించిన విద్యార్థులు రోహిత్ వేముల, పాయల్ తడ్వీల తల్లులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ పిటిషన్ను విచారించారు. దళితులు, గిరిజనులు చదువుకునేలా విద్యాసంస్థల్లో వాతావరణం కల్పించాలని యూజీసీకి న్యాయస్థానం సూచించింది.