LAC Situation | విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం రాజ్యసభలో భారత్-చైనా సంబంధాలపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద పరిస్థితులపై సైతం సమాచారం ఇచ్చారు. ఎల్ఏసీలో ఇంకా చైనాతో కొన్ని భూభాగాలపై విభేదాలు ఉన్నాయని.. ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని జైశంకర్ పేర్కొన్నారు. జూన్ 2020 గాల్వాన్ లోయరలో జరిగిన ఘర్షణ ఘటన భారత్ – చైనా సంబంధాలపై ప్రభావం చూపిందన్నారు. సరిహద్దులో సైనికులు మారణించడం 45 ఏళ్లలో మొదటిసారి కాదని.. అయితే, ఘటన తర్వాత పెద్ద సంఖ్యలో బలగాల మోహరింపునకు దారి తీసిందన్నారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. మన సైనిక బలగాలు కొవిడ్ , లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలోనూ గాల్వాన్ ఘటనలో అవసరమైన మేరకు స్పందించాయన్నారు. తీవ్రమైన చలితోపాటు ఎన్నో సవాళ్ల మధ్య వేగంగా పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. తూర్పు లద్దాఖ్లోని దళాల ఉపసంహరణ దశలవారీగా ప్రక్రియ పూర్తయ్యిందని.. దేప్సాంగ్, డెమ్చోక్లలో పూర్తి కాలేదన్నారు.
ఎల్ఏసీ ఒప్పందాలకు కట్టుబడి ఉండడంపై ఇరుదేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు. సంబంధాలు చాలారంగాల్లో పురోగామించాయని.. ఇటీవలి సంఘటనలు స్పష్టంగా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడం, సంబంధాల మెరుగునకు ప్రాథమిక షరతులు విధించామని స్పష్టం చేశారు. చైనాతో భవిష్యత్ సంబంధాలపై స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి సంబంధాలను పెంపొందించుకునేందుకు సరిహద్దులో శాంతి అవసరమన్నారు. చైనా ప్రతినిధులతో ఇటీవల జరిగిన సమావేశాలకు సంబంధించిన వివరాలను సైతం రాజ్యసభకు వివరించారు. ఆ తర్వాత బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్చించారన్నారు. జైశంకర్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష సభ్యులు వివరణ కోరేందుకు అనుమతి కోరగా.. డిమాండ్లను చైర్మన్ జగ్దీప్ ధంకర్ తోసిపుచ్చారు. అభ్యంతరం వ్యక్తం చేయడంతో విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.