న్యూఢిల్లీ: భూ కుంభకోణంకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విపక్షాలు ఇవాళ రాజ్యసభలో లేవనెత్తారు. సీఎం రాజీనామా చేస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శూన్యత ఏర్పడరాదు అని బీఆర్ఎస్ నేత డాక్టర్ కే కేశవ రావు తెలిపారు. తదుపరి చర్యలు చేపట్టే వరకు ఆయన్నే సీఎంగా కొనసాగించాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గడిచిన 20 గంటల నుంచి జార్ఖండ్లో ఏం జరుగుతోందని కేశవ రావు ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం జార్ఖండ్లో ప్రభుత్వం ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోరెన్ అరెస్టును ఖండిస్తూ మరో వైపు ఇండియా కూటమికి చెందిన ఎంపీలు కూడా నినాదాలు చేశారు. ఆ కూటమిలో ఉన్న ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. జార్ఖండ్లో తీవ్రమైన అవినీతి జరిగిందని, ఇది కేవలం సోరెన్ అరెస్టుకు చెందిన విషయం కాదు అని పీయూష్ మిశ్రా తెలిపారు.