Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి నిర్మలా సీతారామన్ పలు ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రజా రవాణా సేవల్లోకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నామన్న ఆమె తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ను సైతం పెంచేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో నిర్వహణ, ఉత్పత్తి, సంస్థాపన తదితర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు.