కోల్కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు (Votes Counting) మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 22 జిల్లాల్లోని 339 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటిరకు రాష్ట్రంలోని సుమారు 74 వేల స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 3 వేల స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
బెంగాల్లో మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలు (Gram Panchayat) ఉండగా అధికార పార్టీ 2548 చోట్ల, బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీపీఎం, కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరువలేదు. ఇక 9730 పంచాయతీ సమితిల్లో (Panchayat Samiti) టీఎంసీ 261 చోట్ల ముందంజలో ఉన్నది. 928 జిల్లా పరిషత్ (Zila Parishad) స్థానాల్లో 18 స్థానాల్లో మమతా బెనర్జీ పార్టీ దూసుకుపోతున్నది. పత్రిపక్షాలు అధికార పార్టీకి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.