కోల్కతా : పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్రత ముఖర్జీ(75) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముఖర్జీ.. కోల్కతాలోని ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ముఖర్జీ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవీంద్ర సదన్ శుక్రవారం ఉదయం ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం మమత పేర్కొన్నారు.