కోల్కతా: ఈనెల 22వ తేదీన కోల్కతాలోని కాళీమందిర్లో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) తెలిపారు. కాళీ మందిర్లో పూజలు చేసిన తర్వాత.. అక్కడ నుంచి ఓ భారీ ర్యాలీ తీయనున్నట్లు ఆమె చెప్పారు. హజ్రా నుంచి పార్క్ సర్కస్ మైదానం వరకు సర్వమత ర్యాలీ ఉంటుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలను కవర్ చేస్తూ ఆ ర్యాలీ తీయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఆ ర్యాలీలో పాల్గొనేందుకు అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. ఆ రోజున తమ పార్టీకి చెందిన ప్రతి సభ్యుడు ప్రతి జిల్లాలోనూ మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీలు తీయనున్నట్లు సీఎం బెనర్జీ తెలిపారు. జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ.. అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రతిష్టానలో పాల్గొననున్న విషయం తెలిసిందే.