Mamata Banerjee : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. అధికార బీజేపీ.. ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేయడం, అరెస్టులకు పాల్పడటంపై INDIA కూటమి నేతలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తారని ఆమె తెలిపారు. ఈ మేరకు మమతాబెనర్జీ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్తో స్వయంగా మాట్లాడి నా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పా. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతోంది. దీనిపై ఇవాళ ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు. మా పార్టీ ప్రతినిధిగా డెరెక్ ఒబెరాయ్ వెళ్లనున్నారు’ అని మమతాబెనర్జీ ఎక్స్లో పేర్కొన్నారు.
I vehemently condemn the arrest of Arvind Kejriwal, the sitting elected Chief Minister of Delhi elected by the people. I have personally reached out to Smt Sunita Kejriwal to extend my unwavering support and solidarity. It’s outrageous that while elected opposition CMs are being…
— Mamata Banerjee (@MamataOfficial) March 22, 2024